telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రఘునందన్ మీ నాయినకు కేంద్రం ఇస్తుందా.. కేసీఆర్ ఇస్తుండా

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు బీజేపీ అభ్యర్థిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక బిజేపీ అభ్యర్థి తండ్రి మాదవనేని భగవంతరావుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ 2016 ప్రతి నెల వస్తుందన్నారు. రఘునందన్ రావు తల్లిదండ్రులకు నెల నెల రేషన్ ద్వారా చేరి 6 కిలోల బియ్యం మొత్తంగా 12 కిలోల బియ్యం ఇస్తోంది టి ఆర్ ఎస్ ప్రభుత్వమని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుకు ఇచ్చే రైతు బంధు పెట్టు బడి సహాయం కింద తన తండ్రికి 2 ఎకరాల 15 గుంటలకు కాను ఇప్పటి వరకు 54వేల రూపాయలు అందుకున్నారన్నారు. అలాగే.. అతని తల్లి భారతమ్మ కు 3 ఎకరాల 30 గుంటలకు గానూ 86 వేల 250 రూపాయలు రైతు బంధు సహాయం వస్తుందని పేర్కొన్నారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కి 4 ఎకరాల 30 గుంటలకు గాను ఒక లక్ష 11 వేల 550 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తన తల్లి తండ్రులకు ఆసరాగా లేని రఘునందన్ రావు దుబ్బాక ప్రజలకు ఎం చేస్తాడు అని ప్రజలు అడుగుతున్నారని ఫైర్‌ అయ్యారు. రైతు బంధు , ఆసరా పింఛన్ , రేషన్ బియ్యం తీసుకుంటున్న బిజేపీ అభ్యర్థి తెలంగాణ ప్రభుత్వంపై ఎలా విమర్శలు చేస్తాడని ప్రశ్నించారు. రఘునందన్ మీ నాయినకు కేంద్రం ఇస్తుందా.. కేసీఆర్ ఇస్తుండా అని ప్రశ్నించారు. మొత్తం బీజేపీ ఇస్తుందని డబ్బా కొట్టుకుంటున్న రఘునందన్ రావు..నీ తండ్రి తీసుకునే 2,016 రూపాయల పెన్షన్ లో కేంద్రం వాటా ఎంతనో చెప్పు అని నిలదీశారు.

Related posts