telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ది రాజకీయ కక్ష.. అనాలోచిత నిర్ణయం: కళా వెంకట్రావ్‌

TDP Kala write letter to Farmers

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత కళా వెంకట్రావ్‌ విమర్శల వర్షం కురిపించారు. ఎవరి మీదో నింద వేయాలనే అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకామే విద్యుత్‌ కొనుగోళ్లు చేశామని తెలిపారు. జగన్‌ది రాజకీయ కక్ష, అనాలోచిత నిర్ణయమేనని తప్పుబట్టారు. విద్యుత్‌ కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కళా వెంకట్రావ్‌ తెలిపారు. 2014లో 22 లక్షల మిలియన్‌ యూనిట్ల లోటును 2 నెలల్లో అధిగమించామని అన్నారు.

కొత్త ప్రభుత్వంలో విద్యుత్‌ కోతలు ఎక్కువయ్యాయని విమర్శించారు. టీడీపీపై బురదజల్లేందుకే ప్రభుత్వం యత్నింస్తోందని ఆరోపించారు. వైఎస్‌ హయాంలో వేసిన అనేక కేబినెట్‌ సబ్‌కమిటీల విచారణలో అన్నీ ఒప్పందాలు సక్రమమే అని రుజువయ్యాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించే పరిస్థితి కనపడటం లేదని దుయ్యబాట్టారు.

Related posts