telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

7 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు యథాతథం ఉంటాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. వరంగల్‌లో ప్రశ్నాపత్రాల గల్లంతు వ్యవహారంలో విద్యార్థులు ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షకేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని బోర్డు సెక్రటరీ ఏ అశోక్ సూచించారు.

విద్యార్థులు పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంట ల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

Related posts