ఏపీ మంత్రి నారా లోకేశ్ పోటీ చేసే స్థానం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ లోకేశ్ భీమిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం టీడీపీ అధిష్టానం లోకేశ్ పోటీ పై క్లారిటీ ఇంచ్చింది. విశాఖ నార్త్ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తారని ఆయన పేరును ఏపీ సీఎం చంద్రబాబు ఖరారు చేశారు.
విశాఖ ఉత్తర టిక్కెట్ ఆశిస్తున్నవారు పలువురు సోమవారం రాత్రి పార్టీ అధినేతను కలవగా లోకేశ్ పోటీ చేస్తున్నారని, ఆయనకు సహకరించాలని సూచించినట్టు తెలిసింది. దాంతో ఆ స్థానంపై కూడా సందిగ్ధత తొలగిపోయింది. ఈ టిక్కెట్ను ఆశించిన మాజీ ఎంపీ సబ్బం హరి పేరును మాడుగులకు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి తనయుడే పోటీ చేస్తుండడంతో స్వాతి కృష్ణారెడ్డి కూడా వెనక్కి తగ్గారు. దీంతో విశాఖ నార్త్ నుంచి లోకేష్ పోటీ దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది.