ఏపీకీ మూడు రాజధానుల ప్రకటన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలకు దారితీస్తుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ కొన్ని రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోపక్క రాజధానిని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయాలంటూ ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు సరికొత్తగా ఆందోళనను లేవనెత్తారు. ఈ రోజు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపతి సతీశ్ ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ‘మన ప్రకాశం జిల్లా మన భవిష్యత్తు’, ‘పేరుకే ప్రకాశం లేదు జిల్లాకు వికాసం’ అంటూ నినాదాలు చేశారు.
శివరామకృష్ణన్ కమిటీ సూచించిన సిఫారసుల మేరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న ప్రకాశంను రాజధాని చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అదేజిల్లాలో మరోపక్క అమరావతి రాజధానిగా ఉండాలంటూ టీడీపీ దీక్షలు చేపట్టింది.
జగన్ మేనమామ బినామీకి టెండర్: దేవినేని ఉమ