telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : ముంబై లక్ష్యం 165

ఐపీఎల్ 2020 లో ఈ రోజు అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతి మొదట బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు ఓపెనర్ మంచి ఆరంబానే ఇచ్చారు. ఓపెనర్ జోష్ ఫిలిప్ (33) పరుగుల వద్ద ఔట్ అయిన మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్(74) పరుగులతో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ అందరూ విఫలం కావడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీయగా పొలార్డ్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై 165 పరుగులు చేయాలి. అయితే ప్రస్తుతం బెంగళూరు బౌలర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే వారు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్లడం మాత్రమే కాకుండా ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి జట్టుగా నిలుస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts