ఏపీ రాజధానిని కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. 13 జిల్లాల ప్రజలు రాజధాని అమరావతిని కాపాడుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కమిటీ నివేదిక పై సుజనా స్పందించారు.
బీసీజీ కమిటీ నివేదిక హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కమిటీని ఎప్పుడు వేశారు? అని ఆయన ప్రశించారు. అయినా మూడు రోజుల్లోనే నివేదిక రూపొందించగలరా? అంటూ సుజనా అసంతృప్తి వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో ఆర్థిక అత్యయిక పరిస్థితి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు
తిరుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి: చంద్రబాబు