telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారికి సబ్సిడీపై కందిపప్పు: కొడాలి నాని

kodali nani ycp

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సరుకుల ధరలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఉల్లిపాయలతో పాటు కందిపప్పును కూడా సబ్సిడీ ధరలకు అందిస్తున్నామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంది పప్పు ధరలు పెరిగాయని అన్నారు.

తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారికి సబ్సిడీతో కందిపప్పును అందిస్తున్నామని అన్నారు. ఏపీలోని రైతు బజార్లలో రూ.25కే ఉల్లిని అందిస్తున్నామని వివరణ ఇచ్చారు. కొన్నింటి ధరలు పెరిగాయని, మరి కొన్నింటి ధరలు తగ్గాయని ఆయన తెలిపారు. పెరిగిన ధరలను తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని సభలో వివరణ ఇచ్చారు.

Related posts