telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి: చంద్రబాబు

Chandrababu Comments Jagan KCR

తిరుమలను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని కుట్రపన్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మంగళవారం నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకొన్న వారేవరూ బాగుపడలేదన్నారు. తిరుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి అని ఆయన తేల్చిచెప్పారు.

పవన్ పార్టీని నమ్ముకొంటే అత్తారింటికి పోతారని, తనను నమ్ముకొంటే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతానని బాబు అన్నారు. కేసీఆర్ అందరినీ బెదిరించి వైసీపీలోకి పంపిస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. వలసపక్షులు ఏపీపై పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు కష్టకాలంలో ఉన్న సమయంలో సినీ నటులు ఎందుకు రాలేదో చెప్పాలని బాబు ప్రశ్నించారు. హైద్రాబాద్‌లో ఇంతకాలం ఉంటూ కేసీఆర్‌కు ఊడిగం చేసుకోవాలని చంద్రబాబు ద్వజమెత్తారు.

Related posts