ఎన్నో ఏళ్లుగా కొనసాగుతన్న అయోద్య కేసు విచారణను నెల రోజుల్లో పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు స్ఫష్టం చేసింది. అయోధ్య అంశంపై ఈ రోజు కూడా ఈ కేసు విచారణను ధర్మాసనం కొనసాగించింది. అక్టోబర్ 18న అయోధ్య కేసు వాదనలు ముగుస్తాయని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో మధ్యవర్తిత్వం కొనసాగించాలని ఇరువర్గాలు భావిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపింది.
ఇప్పటివరకు సాగినట్టుగానే, ఇకముందు కూడా మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులు గోప్యంగా కొనసాగాలని సుప్రీం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులకు సమాంతరంగా కోర్టు విచారణ జరుగుతుందని వెల్లడించింది.వచ్చే నెల 18 నాటికి ఈ కేసు విచారణను పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ అదేశించిన విషయం తెలిసిందే. నవంబర్ 17న ఆయన పదవీ కాలం ముగియనుంది. సీజేఐ రిటైర్మెంట్లోపే అయోద్య కేసు తీర్పు వెలువడే అవకాశముంది.