telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విద్యార్దుల భవిష్యత్‌ ఆగంకాకుండా పుస్తకాల పంపిణీ: ఎర్రబెల్లి

Errabelli Trs

కరోనా విపత్తులో కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆపకుండా అపర చాణక్యుడిలా సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్నారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న  పుస్తకాలను  విద్యార్ధులకు మంత్రి  తన సొంత గ్రామం పర్వతగిరిలో విద్యార్దులకు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ

ప్రపంచమంతా కరోనా విపత్తులో కొట్టుకుపోతుందని అన్నారు. ఈ దశలోనూ విద్యార్దుల భవిష్యత్‌ ఆగంకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పుస్తకాలు అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే టీ-సాట్‌ ద్వారా విద్యార్దులకు శాటిలైట్‌ ద్వారా పాఠాలు కూడా చెబుతున్నట్టు మంత్రి తెలిపారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో పిల్లలకు పాఠ్య పుస్తకాల పంపిణీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. విద్యార్ధులు కూడా ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలను ఎప్పటికప్పుడు చుదువుకుంటూ ఆప్‌డేట్‌ కావాలని సూచించారు.

Related posts