హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వచ్చే నెల 1వ తేదీ నుంచి టెలీ కన్సల్టెన్సీ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సాధారణ రోగులకు ఉచితంగా టెలీమెడిసిన్ చికిత్స అందించనున్నారు. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రుమటాలజీ నిపుణులు టెలీ మెడిసిన్ ద్వారా సేవలు అందించనున్నారు.
వైద్య సేవలకోసం 040-23489244కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వైద్యులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఐదేళ్లుగా గుర్తుకురాని అవినీతి ఇప్పుడే గుర్తొచ్చిందా?