టీఆర్ఎస్ను దెబ్బకొట్టే పార్టీ బీజేపీకి మాత్రమే అని ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సోమవారం దేవరకద్ర నియోజకవర్గంలో ‘ప్రజా ఘోస- బీజేపీ భరోసా’ కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో ఈటల మీడియాతో మాట్లాడారు… అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్పై విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. వారంతా కేసీఆర్తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. అందుకే నియోజకవర్గాల్లో పనుల కోసమే వారు టీఆర్ఎస్లో కొనసాగుతున్నారని అన్నారు. రు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని , ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు ఓటేసినట్టేనని అన్నారు. . గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేయడం ఖాయం అని ఈటల అన్నారు. టీఆర్ఎస్ ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు చెప్పారని అన్నారు. రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమ పార్టీలోకి ఎవరొచ్చినా గెలిపించుకుంటామని చెప్పారు.
కేసీఆర్ను ఎదుర్కొని.. రాష్ట్రం సుభిక్షంగా ఉంచాలంటే అది బీజేపీతోనే సాధ్యం అని చెప్పారు. తెలంగాణలో ఎప్పడూ ఎన్నికలు జరిగిన.. కాషాయ జెండా ఎగురుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.