తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కరోనా కేసులపై తెలంగాణ ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. టెస్టులు చేయొద్దని కేంద్రం, ఐసీఎంఆర్ ఎక్కడా చెప్పలేదన్నారు. తెలంగాణలో రోజుకు రెండు వేల టెస్టులు చేసే సామర్థ్యం ఉందని బండి సంజయ్ తెలిపారు.
టెస్టులు చేయకపోవటం వల్లే తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయని ఆయన అన్నారు. రంజాన్ దృష్ట్యా ప్రణాళిక ప్రకారమే కరోనా టెస్టులు ఆపేశారన్నారు. ఒవైసీ ఒత్తిడితోనే మృతుల నమూనాలను పరీక్షించటం లేదన్నారు. పాతబస్తీలో లాక్డౌన్ అమలు చేసే దమ్ము కేసీఆర్కు లేదని బండి సంజయ్ విమర్శించారు. మత ప్రాతిపదికన సీఎం కేసీఆర్ లాక్డౌన్ అమలు చేస్తున్నారన్నారు. రికార్డులు, రివార్డులు కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారని దుయ్యబట్టారు.