అమెరికాలో ని టెక్సాస్లో విమానం కూలిన ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. రెండు ఇంజిన్లు కలిగి ఉన్న బీచ్క్రాఫ్ట్ కింగ్ ఏయిర్ 350 రకానికి చెందిన విమానం టెక్సాస్లోని యాడిసన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్దిక్షణాల్లోనే హ్యాంగర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాంతో విమానంలో మంటలు చెలరేగి, అందులో ఉన్న ప్రయాణికులంతా అగ్నికి ఆహుతయ్యారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 10 మంది ప్రయాణికులు కాలి బూడిదయినయిట్లు అధికారులు వెల్లడించారు. విమానం టేకాఫ్ సమయంలో హ్యాంగర్ను ఎందుకు ఢీకొట్టిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మునిసిపల్ ఎన్నికల్లో విజయం తమదే: మంత్రి తలసాని