బీజేపీ శాసనసభాపక్ష నేత (బీజేపీఎల్పీ)గా దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో దేవేంద్ర ఫఢ్నవీస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా ఫడ్నవిస్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శివసేనకు రెండున్నరేళ్లపాటు సీఎం పదవిని అప్పగిస్తామని తామెన్నడూ హామీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కుండబద్దలు కొట్టారు. తదుపరి ప్రభుత్వంలో ఐదేండ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తేల్చిచెప్పారు.
దీనిపై రేపు ముంబైలో శివసేన శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? అన్న విషయంపై శివసేన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.