తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా దాదాపు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషయమై ఓ నెటిజన్ కేటీఆర్ ను నేరుగా ప్రశ్నించారు. విక్రమ్ యాదవ్ అనే నెటిజన్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘కేటీఆర్ సార్ అన్నింటికి జవాబు ఇస్తున్నారు. ఇంటర్ విద్యార్థుల విషయంలో మాత్రం మాట దాటేస్తున్నారు. కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీపై నమ్మకాన్ని పోగొట్టకండి. మీరు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేం నమ్ముతున్నాం’ అని ట్వీట్ చేశారు.
దీనికి కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘నన్ను ఏం క్లారిఫికేషన్ ఇవ్వమంటారు సార్? మన రాష్ట్రంలో జరిగింది నిజంగా దురదృష్టకరమైన ఘటన. ఈ ఘటన వెనుకున్న వారిని కఠినంగా శిక్షించాలి. నేను ఓ తండ్రినే.. పిల్లలను కోల్పోయిన అమ్మానాన్నల బాధను అర్థం చేసుకోగలను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.