ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పలు బహిరంగ సభల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం పై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఆయన పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల బహిరంగ సభల్లో మతవిధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో బేతి మహేందర్ రెడ్డి పిటిషన్ను పరిశీలించిన కోర్టు.. ఐపీసీ సెక్షన్ 153-ఏ, 153-బి, 506 కింద మహేందర్పై కేసులు నమోదు చేసిదర్యాప్తు చేయాలని కరీంనగర్ త్రీటౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే సీపీ కమలాసన్రెడ్డి ఇప్పటికే అక్బరుద్దీన్కు క్లీన్చిట్ ఇచ్చారు.
previous post