telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్షయ్, కరీనా .. ‘గుడ్ న్యూస్’ .. జులై లోనే..

akshay movie good news in july

బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లో గుడ్ న్యూస్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఖిలాడీ కుమార్ అక్షయ్‌, గ్లామర్ డాల్ కరీనా కపూర్ ఖాన్ జంటగా ఈ చిత్రం రూపొందుతుంది. 2015లో గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే చిత్రంతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసిన ఈ జంట ఇప్పుడు గుడ్ న్యూస్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు.

గుడ్ న్యూస్ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రానికి రాజ్ మెహతా దర్శకత్వం వహించనుండగా, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. దిల్జిత్‌ద దోసంగ్ మరియు కైరా అద్వానీ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. 2019 జూలై 19న మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్‌. కాని డిసెంబర్ 27న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు కరణ్ జోహార్.

సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 రిలీజ్ అయిన వారం తర్వాత ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. మంచి మెసేజ్‌తో పాటు ఎంటర్‌టైనింగ్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. కరీనా చివరిగా వీరే ది వెడ్డింగ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అక్షయ్ నటించిన కేసరి చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Related posts