telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇది దున్నపోతు ప్రభుత్వం: చంద్రబాబు

chandrababu

వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు. ఉల్లిపాయల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రజలకు విక్రయించే కిలో ఉల్లిపాయల్లో నలభై శాతం కుళ్లిపోయినట్టున్నాయని విమర్శించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎత్తుకుని, క్యూలో ఐదారు గంటలు నిలబడి ఉల్లిపాయలు కొనుక్కుంటున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

గుడివాడలో సాంబయ్య అనే వ్యక్తి క్యూలో కుప్పకూలిపోయాడని, ఈ విషయం ఎంత సిగ్గుచేటో ప్రభుత్వం ఆలోచించుకోవాలని అన్నారు. ఉల్లి కొనుగోలు కోసం ఇలాంటి పరిస్థితి ఉన్నా ఈ ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఇది ఎంత దున్నపోతు-ప్రభుత్వం? అంటూ నిప్పులు చెరిగారు. ఉల్లిపాయలే వాడాలా? క్యాబేజ్ వాడుకోవచ్చుగా? అంటూ ఓ మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Related posts