telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హరిత తెలంగాణ దిశగా అందరూ కృషి చేయాలి: మంత్రి సబిత

Sabitha indrareddy

హరిత తెలంగాణ దిశగా అందరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం పరిగి నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

పరిగి మండలం రంగంపల్లి అటవీ ప్రాంతంలో నాటిన 36,400 మొక్కల సంరక్షణపై అధికారులను ఆరా తీశారు. మొక్కలను సంరక్షిస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ హాయ్‌ను మంత్రి ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అధికారి చాలా అవసరమని పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా ఓ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Related posts