ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమాలో నటిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కానుంది. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా జాతీయ అవార్డు గ్రహిత కీర్తీ సురేష్ ఇందులో హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఈ చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్ను ఇటీవల ప్రకటించింది. అన్ని అనుకున్నట్లే జరగితే ఈ సినిమాను వచ్చే 2021 ఆగస్టులో విడుదల చేసేందుకు చూస్తున్నారు. మహేష్ తాజా చిత్రం సరిలేరు నీసిమాను అనిల్ రావిపూడితో కలిసి చేశాడు. అయితే ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట వచ్చే ఏడాది ఆగస్టు ఏడోతారీకున విడుదల చేసేదందదుకు చూస్తున్నారు. మరి ఆ సమయాని ఎంతవరకు విడుదల చేస్తారని చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బ్యాం్ ఎంప్లాయ్గా కనిపించడంతోపాటు పాన్ బ్రోకర్గా కనిపిస్తాడని, ఈ సినిమా కూడా సమాజానికి ఓ మెసేజ్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ విలన్గా బాలీవుడ్ నటుడు అనిల కపూర్ను సంప్రదించారు. కానీ అతడు పారితోషిసం అధికంగా అడుగుతున్నాడని అన్నారు. ఇక చూడాలి మరి ఈ సినిమాలో విలన్ గా ఎవరు కనిపించనున్నారు అనేది.
previous post
next post
రాజకీయాల కోసం ఆసుపత్రుల్లో తిరగడం లేదు: భట్టి విక్రమార్క