telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆరోగ్య రంగంలో సంస్కరణలకు జగన్ ఉత్సాహం!

రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతపై ఏపీ సీఎం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యం విషయంలో సీఎం కొత్త సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిపుణుల కమిటీ ఆరోగ్య రంగంలో సంస్కరణలపై జగన్ కు నివేదిక సమర్పించింది. నివేదికలోని అంశాలను అధ్యయనం చేసిన సీఎం జగన్ దానిపై కమిటీ సభ్యులతోనూ, అధికారులతోనూ సమీక్ష నిర్వహించారు.

విశాఖలో ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలను ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య భద్రతపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైద్యులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. గాంధీ విగ్రహం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.

Related posts