telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ప్రేమ పేరుతో మోసం.. ఇంజనీర్ ఆత్మహత్య…

మేడిపల్లిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో ప్రియుడు వంచించడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆ ఇంజనీర్. ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాడు ప్రియుడు అజయ్. వ్యక్తిగతం గా ఉన్న ఫోటోలు అన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ఆ తర్వాత సోషల్ మీడియా లో పెట్టిన ఫోటోలు తీసేందుకు బ్లాక్ మెయిల్ చేసాడు అజయ్. ఎంత అడిగిన ఫోటోలు తీయకుండా శ్వేతను వేధింపులకు గురి చేసాడు అజయ్. మొదట వివాహం చేసుకుంటానని తర్వాత వేధింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియా లో ఫోటోలు పెట్టడం తో పరువు పోయింది అంటూ అవమానానికి గురైంది శ్వేత. అజయ్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయిన అజయ్ ప్రవర్తన మారలేదు. ఇక అజయ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది శ్వేత.ట్రైన్ కు ఎదురు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts