తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్లో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్యప్రాణుల వేట కేసులో నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్న శ్రీలం రంగయ్య పోలీస్స్టేషన్ బాత్రూమ్లో ఉరివేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే పోలీసులు మృతదేహాన్ని మంథని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అయితే వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా సిఐ, ఎస్ఐ ఫోన్లులిఫ్ట్ చేయని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో మృతదేహం వద్దకు ఎవ్వరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మృతుడు ముత్తారం మండలంలోని రామయ్యపల్లి గ్రామానికి చెందినవాడు.