telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈవీఎంలలో జరిగిన అవినీతి వల్ల.. వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువ: కేఏ పాల్

KA Paul comments Chandrababu

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పాల్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ లో జరిగిన పరిణామాలపై ఆయన మాట్లాడుతూ నరసాపురం లోక్ సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయని తెలిపారు.

కానీ ఈవీఎంలలో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని పాల్ ఆరోపించారు. ఎన్నికల సంఘం ప్రధాని మోదీ చేతుల్లో ఉందని ఆరోపించారు. అవినీతిపై పోరాడేందుకు యువత తనతో కలిసి రావాలని పిప్లుపునిచ్చారు. యువత తన వెంట వస్తే దీక్ష చేపడతానని చెప్పారు.

Related posts