telugu navyamedia
Uncategorized

నలుగురికి మరణ శిక్ష రద్దు.. కింది కోర్టు తీర్పును కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Judgement

గుంటూరు జిల్లాలో నలుగురికి మరణ శిక్షను ఏపీ హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. తంగెడ గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. కాలిబాట విషయంలో తలెత్తిన వివాదంలో సైదాను చంపేశారంటూ ఈ కేసులో పోలీసులు సుభాని, మరో ముగ్గురిపై అభియోగాలు నమోదు చేశారు. గురజాల పదవ అడిషనల్ జిల్లా కోర్టు ఆ నలుగురికి మరణశిక్షను విధించింది.

అయితే గురజాల న్యాయస్థానం ఇచ్చిన తీర్పును నిందితులు హైకోర్టులో అప్పీల్ చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును కొట్టివేసింది. పైగా, నిందితులు కారాగార శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకపోతే వారిని వెంటనే విడుదల చేయాలని పేర్కొంది.

Related posts