సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని పోలీస్ స్టేషన్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో బుధవారం చోటుచేసుకుంది. హెడ్కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. మరో ఎనిమిది నెలల్లో ప్రకాష్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు.
ఈ సమయంలో ప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాల విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడికి కొడుకు, కూతురున్నారు.