telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

లవ్ ఇన్ క్వారంటైన్..పెళ్లితో ఒకటైన జంట!

కరోనా దెబ్బకు ప్రాణభయంతో ఎందరో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ‘లవ్ ఇన్ క్వారంటైన్ తో ఇద్దరొక్కటయ్యారు. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన యువకుడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతికి కరోనా సోకింది.

దీంతో వీరిద్దరూ గుంటూరులోని ఓ కొర్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఇద్దరి బెడ్లు పక్కపక్కనే ఉన్నాయి. దీంతో, తొలుత మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి. చికిత్స సమయంలో ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరికీ నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి వారు డిశ్చార్జ్ అయ్యారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తమ ప్రేమ గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. అబ్బాయి హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అమ్మాయి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది.

ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, వారిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలా రెండు వారాల్లోనే వారి ప్రేమ కథ ప్రారంభమై పెళ్లితో ముగింపు పలికింది.

Related posts