telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సీనియర్ సినీనటుడు శరత్ బాబు మృతికి సంతాపం తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హీరో గా, విలన్ గా, సహాయ నటుడిగా ఏ పాత్రలోనైనా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన విలక్షణ నటుడు శరత్ బాబు

1973 లో రామరాజ్యం చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శరత్ బాబు తెలుగు, తమిళం తదితర భాషలలో 300 కు పైగా చిత్రాలలో నటించారు.

సంసారం ఒక చదరంగం, మరోచరిత్ర, మూడుముళ్ళ బంధం, సాగర సంగమం, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలు విశేషంగా ప్రేక్షకుల మన్ననలు పొందాయి.

శరత్ బాబు మృతి చిత్ర పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటు

శరత్ బాబు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్న.. మంత్రి తలసాని

Related posts