telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ కరోనా : మళ్ళీ పెరిగిన మరణాలు…

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 62,224 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,96,33,105 కి చేరింది. ఇందులో 2,83,88,100 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,65,432 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 2542 మంది మృతి చెందారు. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,79,573 కి చేరింది. ఇక 24 గంటల్లో 1,07,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Related posts