ప్రముఖ వ్యాపారవేత్త జయరాం చిగురుపాటి జనవరి 31న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో తన కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అక్కడ కేసు విచారణ అనంతరం.. కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.
ఇప్పటికే ప్రధాన నిందితుడు రాకేశ్రెడ్డి సహా 8 మందిని అరెస్టు చేశారు. ఈ హత్యకేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కేసులో 388 పేజీల ఛార్జిషీట్ను జూబ్లిహిల్స్ పోలీసులు దాఖలు చేశారు. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్టు సమాచారం.