telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రేపు ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను జూన్ 6వ తేదీన(సోమ‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు

విజయవాడ ఎమ్‌జీ రోడ్డు వద్ద నున్న గేట్‌వే హోటల్‌ లో ఫలితాలు విడుదల కార్యక్రమం జరగనుంది. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.in లో సోమవారం తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది.

కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.

ఈసారి పదో తరగతి  ఫలితాలు గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు

 

Related posts