అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ మందడంలో ధర్నా చేపట్టిన రైతులకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజధాని తరలింపు అనేది ఉన్మాద చర్య అని కనకమేడల మండిపడ్డారు. రాజధాని రైతుల ఆందోళనను పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. రాజధాని కోసం కోర్టుల్లో కేసులు వేస్తామని అన్నారు. అమరావతికి రక్షణగా ఎన్నో చట్టాలు ఉన్నాయని, జీఎన్ రావు కమిటీకి ఏ చట్టబద్ధత ఉంది? అని ఆయన ప్రశ్నించారు.
రాజధానిని, హైకోర్టును తరలించాక అమరావతిలో ఇంకేముంటుంది? అని కనకమేడల ప్రశ్నించారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా ఒత్తిడి తీసుకొస్తామన్నాని తెలిపారు, అమరావతిని శ్మశానం అని కొందరు అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.