ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాకు వ్యాక్సిన్ కనుగునేందుకు ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయోగాలు చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ రేసులో ముందున్న రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై ప్రజలు ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు తలెత్తాయని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు. ఈ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ తాము ఊహించినవేనని ఆయన అన్నారు. అవి సాధారణంగా ఒకటిన్నర రోజుల్లో పోతాయని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా త్వరలో వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని రష్యా ఇటీవలే తెలిపింది. దాదాపు 40 వేల మందికి టీకా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ మొదటి డోసు వేశారు. త్వరలోనే వారికి రెండో డోసును వేయనున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం ఓ యాప్ను రూపొందించారు.