శ్రీలంక లో కుంభవృష్టిగా కురిసిన వర్షాలతో వేలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. గత రెండు వారాలు భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీనితో ఉత్తర, ఈశాన్య, తూర్పు ప్రావిన్స్ల్లో భారీ వరదలు సంభవించాయని స్థానిక మీడియా తన వార్తా కథనాలలోవెల్డఇంచింది. తూర్పు ప్రావిన్స్లో 79 వేల మందిపై ఈ వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపగా 798 కుటుంబాలకు చెందిన 2,507 మంది నిర్వాసితులయినట్లు విపత్తు నిర్వహణా కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటన ద్వారా తెలుస్తోంది.
అదే విధంగా నార్తర్న్ ప్రావిన్స్లోని ఐదు జిల్లాలకు చెందిన 64,448 మందిపై వరద ప్రభావం పడిందని, ఇందులో 2,611 కుటుంబాలకు చెందిన 8,478 మంది నిర్వాసితులయ్యారని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. నిర్వాసితులకు ఆహార, వసతి సౌకర్యాలుకల్పించేందుకు శ్రీలంక ప్రభుత్వం 17 లక్షల రూపాయలను విడుదల చేసింది.
తిరుపతిని ఏపీ రాజధానిగా చేయాలి..మాజీ మంత్రి చింతా మోహన్