డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై టీడీపీ నేత వంగలపూడి అనిత మరోసారి ఘాటుగా స్పందించారు. సుధాకర్ను పిచ్చోడిని చేయాలని చూస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సుధాకర్కు అన్యాయం జరిగితే అది ఆయన ఒక్కడికే జరిగినట్టు కాదని, మొత్తం దళిత జాతికి అన్యాయం జరిగినట్టే అవుతుందని అన్నారు. రాష్ట్రంలో ఓ వైద్యుడి పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
విశాఖ మానసిక ఆసుపత్రి సూపరింటెండెంట్పైనా అనిత మండిపడ్డారు. కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే డాక్టర్ సుధాకర్ను పంపిస్తామని అంటున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. సుధాకర్ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుని మనకెందుకొచ్చిన గొడవ అని ఊరుకుంటే రేపు ఇదే పరిస్థితి మనకీ వస్తుందని అనిత హెచ్చరించారు. డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.