telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

భార్య మద్యం సేవించడం లేదట… భర్త ఫిర్యాదు

Alcohol

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరానికి చెందిన ఓ మధ్యతరగతి వ్యక్తికి పదేళ్లక్రితం అదే నగరానికి చెందిన మహిళతో పెళ్లై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తమ కుటుంబ విందులు, వినోదాల సందర్భంగా తన భార్య మద్యం తాగడం లేదని సాక్షాత్తూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన తల్లితోపాటు అందరూ పార్టీల్లో మద్యం తాగుతున్నారని, కాని తన భార్య మాత్రం మద్యం తాగడం లేదని, కుటుంబ విందుల్లో తన భార్య కంపెనీ ఇవ్వక పోవడం వల్ల తరచూ తన భార్యతో గొడవలు జరుగుతున్నాయని సదరు భర్త ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేశారు. తనకు మద్యం తాగడం ఇష్టం లేదని భార్య చెబుతుండగా, పార్టీల్లో తోడు కోసమైనా తాగమని భర్త వాదిస్తున్నాడు. అతని ఫిర్యాదుతో ఫ్యామిలీ కోర్టు కౌన్సెలర్లు నిర్ఘాంత పోయారు.

Related posts