ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోసారి దాడులకు తెగబడింది. బాగ్దాద్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ బలాద్ ఎయిర్ బేస్పై రాకెట్లతో విరుచుకుపడింది. మొత్తం 8 రాకెట్లు తమ స్థావరాన్ని ఢీకొట్టినట్టు ఇరాక్ తెలిపింది. ఈ దాడుల్లో మొత్తం నలుగురు గాయపడ్డారు.
ఇరాన్ సైనికాధికారిని అమెరికా హతమార్చడంతో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా అలాగే ఉన్నట్టు తాజా దాడితో స్పష్టమైంది. మరోవైపు, ఇరాన్ను అమెరికా హెచ్చరిస్తూనే ఉంది. తీరు మార్చుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ ఈ దాడికి పాల్పడడం గమనార్హం.
పవన్ ఓటమిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్