ఏప్రిల్లో మిచిగాన్లోని లివొనియాలో 20 ఏళ్ల మైఖేల్ ప్రుయిట్ అనే యువకుడు చనిపోయిన 20 నిమిషాల తరువాత మళ్లీ బతికిన మిరాకిల్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే… ఎలక్ట్రిషియన్గా పని చేసే తన తండ్రి కేయిత్ జాకబ్స్కు సహకరిస్తున్న మైఖేల్ కు కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ వల్ల నిచ్చెన పైనుంచి కిందపడిపోయాడు మైఖేల్. విగతజీవిగా పడి ఉన్న అతడ్ని చూసి జాకబ్స్ వెంటనే 911కు కాల్ చేశాడు. వెంటనే హుటాహుటిన మైఖేల్ను చికిత్స కోసం బోమోంట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 20 నిమిషాలు గడిచిపోయాయి. ఎలాంటి చలనంలేని మైఖేల్ను చూసి ఆసుపత్రి వైద్యులు మొదట చనిపోయాడనుకున్నారు.అయినా తమవంతు ప్రయత్నంగా షాక్ ఇచ్చి చూశారు వైద్యులు. తొలి ప్రయత్నంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అయినా వారి ప్రయత్నాన్ని కొనసాగించారు. రెండోసారి ఇంకాస్త ఎక్కువ పరిమితితో షాక్ ఇవ్వడంతో మైఖేల్ లో హృదయస్పందన మొదలైంది. ఇంకో ఐదు నిమిషాలైతే ఆక్సిజన్ అందక అతడి మెదడు నరాలు దెబ్బతిని చనిపోయేవాడని మైఖేల్కు చికిత్స అందించిన వైద్యురాలు డా. ఏంజెల్ చడ్లర్ తెలిపింది. కొన్ని రోజుల వరకు ఆసుపత్రిలోనే ఉన్న మైఖేల్ ఇటీవలె పూర్తిగా కోలుకున్నాడు.
next post