telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్…

టీడీపీ మాజీ ఎమ్మెల్యే రవికుమార్ కు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పరిషత్ ఎన్నికల సమయంలో ఆమదాలవలస నియోజకవర్గం పరిధిలోని కూనరవి స్వగ్రామం పెను బర్తిలో వైసీపీ నేత ఇంటి పై టీడీపీ వర్గీయులు దాడి చేశారు . ఈ దాడి నేపథ్యంలో కూనరవి పై చిరంజీవి నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూనరవి ఓడిపోయిన ప్రస్టేషన్ లో ఉన్నాడని..అందుకే బయట ఊరి నుంచి మనుషుల్ని తెప్పించుకుని వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేయించారని ఆరోపించారు . తాను లేకపోతే ప్రజాస్వామ్యం లేదని నీతులు వల్లించే కూనరవికి పెనుబర్తిలో వైసీపీ నేతల పై దాడి చేయించలేదని చెప్పే దమ్ముందా అని చిరంజీవి నాగ్ ప్రశ్నించారు .మూడు సార్లు ఓడిపోయారు ఈలెక్కన తాము ఎంతమందిని మర్డర్లు చేయాలని నిలదీశారు. కూనరవి ప్రస్టేషన్ లో మతిస్థిమితం కోల్పోతున్నావ్ అంటూ ఫైర్ అయ్యారు . చంద్రబాబు స్టే ఫ్రీ బాబు గా పేరు తెచ్చుకుంటే  కూనరవి బెయిల్ రవికుమార్ గా పేరు తెచ్చుకున్నాడని విమర్శించారు. ఇప్పుడు కూడా పెనుబర్తి విషయంలో కేసు నమోదు కాబోతోందని తెలిసి పరారీలో ఉన్నాడని…ఏడాదికి ఆర్నెల్లు పరారీలోనే ఉండే ఇదేం నాయకత్వం అంటూ సెటైర్లు వేశారు.

Related posts