ఐపీఎల్ 2021 లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో శుక్రవారం రాత్రి జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచులో ఆర్సీబీ యువ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ ఆడలేదు. రెండు క్రీజుల క్రితమే జట్టుతో కలిసినా.. పడిక్కల్కు ముంబైతో మ్యాచ్ ఆడే అవకాశం లభించకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పడిక్కల్ మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఫ్రాంఛైజీ యాజమాన్యాలు అతనిపై అసంతృప్తిగా ఉండడమే అని సమాచారం తెలిసింది. గతనెల 22న దేవ్దత్ పడిక్కల్కు కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. దీంతో అతను ఆర్సీబీ క్యాంప్ను నుంచి నేరుగా హోం క్వారంటైన్కు వెళ్లాడు. ఆ సమయంలో అతనికి ఎలాంటి లక్షణాలు లేవు. 7 రోజులు హోం క్వారంటైన్ అనంతరం జరిపిన కరోనా టెస్టుల్లో పడిక్కల్కు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఏప్రిల్ 7న బెంగళూరు నుంచి స్వయంగా కారును నడుపుకుంటూ వచ్చి చెన్నైలో బస చేస్తున్న ఆర్సీబీ క్యాంప్కు చేరుకున్నాడు. ఆ వెంటనే అతడు తప్పనిసరి 7 రోజుల హోటల్ క్వారంటైన్ పూర్తిచేయకుండానే ఆర్సీబీ టీం బబుల్లోకి ప్రవేశించాడు. మూడు టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందనే తాము బబుల్లోకి అనుమతిచ్చామని ఆర్సీబీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని మూడు రోజులు కూడా గడవక ముందే దేవ్దత్ పడిక్కల్ను డైరెక్ట్గా ఆర్సీబీ టీం బయో బబుల్లోకి తీసుకురావడంపై ఇతర ఫ్రాంఛైజీల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.
previous post
next post