కరోనా పంజా విసురుతోన్న కారణంగా ప్రేక్షకులు స్టేడియానికి అనుమతించకుండా.. ఐపీఎల్ 2021 సీజన్ను నిర్వహిస్తోంది బీసీసీఐ.. దీంతో.. టీవీలతో పాటు.. డిజిటల్ మీడియాలో ఐపీఎల్ మ్యాచ్లు వీక్షించేవారి సంఖ్య ఆమాంతం పెరిగిపోతోంది.. దీంతో.. ఐపీఎల్ను పురస్కరించుకుని జియో తమ ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ప్లాన్లపై తన ఖాతాదారులకు ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ అందించేందుకు డిస్నీ ప్లస్ హాట్స్టార్తో భాగస్వామ్యం కూడా కదుర్చుకుంది జియో. అందులో రూ.399 ప్లాన్తో సంవత్సరం పాటు డిస్నీప్లస్ హాట్స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది జియో.. పోస్టు పెయిడ్ ప్లస్ ప్లాన్స్ నెలకు రూ. 399తో ప్రారంభం కానుండగా.. మరోవైపు ప్రీపెయిడ్ ప్లాన్స్లోనూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేస్తోంది జియో.. రూ. 401 నుంచి రూ. 2,599 మధ్య కొత్త ఆఫర్లను తెచ్చింది.. రూ. 401 జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటాతోపాటు అదనంగా 6జీబీ డేటా లభించనుండగా.. అన్లిమిటెడ్ కాల్స్తో సంవత్సరం కాలం అందించనుండగా.. డిస్నీప్లస్ హాట్స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ 28 రోజుల కాలపరిమితితో అందించనుంది.
previous post