కరోనా కట్టడికి మార్చి నెలలో విధించిన లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలన్నీ బంద్ అయిన విషయం తెలిసిందే. ఈ రోజు ఇంగ్లండ్ లో విద్యాసంవత్సరం ప్రారంభమైంది. దీంతో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. నియంత్రిత పద్ధతిలో స్కూళ్లను తెరవనున్నట్లు ఆ దేశ విద్యాశాఖ ప్రకటించింది.
కొత్త విద్యా సంవత్సరం మంగళవారం నుంచి ప్రారంభం అయినట్లు బ్రిటన్ విద్యాశాఖ మంత్రి గెవిన్ విలియమ్సన్ తెలిపారు. ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కోసం స్కూళ్ లను రీఓపెన్ చేసినట్లు చెప్పారు.
విద్యార్థులు , టీచర్లు, సిబ్బంది మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. సోషల్ డిస్టాన్స్ ను కూడా అమలు చేయనున్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో ఫేస్ మాస్క్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు