telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావు

venkateswara-rao-intaligenc

ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఏసీబీ పటిష్టంగా ఉందన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. అవినీతిపై ప్రజలు నేరుగానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Related posts