telugu navyamedia
రాజకీయ

హైదరాబాద్ నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లు..

అయ్యప్ప భక్తులకు శుభ‌వార్త‌.. పండుగలు, అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

డిసెంబర్ 17న సికింద్రాబాద్ నుంచి కొల్లాం స్టేషన్ కు 07109 నెంబర్ రైలు బయల్దేరనుంది. డిసెంబర్ 19న కొల్లాం నుంచి సికింద్రాబాద్ కు 07110 నెంబర్ రైలు బయల్దేరనుంది.

అలాగే ఈనెల 19, 20 తేదీల్లో కాచిగూడ నుంచి 07053, 07141 నంబర్లతో కొల్లంకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని. 19న కాచిగూడ – కొల్లాం (07053 నంబర్‌) ట్రైన్.. షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ, డోన్‌, గుత్తి, తాడిపత్రి తదితర స్టేషన్లలో ఆగుతుందని చెప్పింది.

20న 07141 నంబర్‌‌ ట్రైన్‌ సికింద్రాబాద్‌, బేగంపేట్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, సేరం, యాద్గిర్, రాయచూర్‌, మంత్రాలయం, తదితర స్టేషన్ల మీదుగా వెళ్లనుందని తెలిపింది.  డిసెంబర్ 10న ఉదయం 8 గంటలకు 07109 నెంబర్ రైలుకు రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Related posts