నిమ్స్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్అన్నారు.హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిని ఈ రోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ పాత భవనాలకు మార్పులు చేస్తున్నట్టు చెప్పారు.
నిమ్స్ లో నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. త్వరలో ఓపీ బ్లాక్ మరింతగా విస్తరిస్తామని తెలిపారు. రోగుల సంఖ్య పెరగడంతో బెడ్స్ కొరత ఉందని, ఈ సమస్యపై దృష్టి సారించినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్స్ లో ఉద్యోగుల కొరత కూడా ఉందని ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఈటల పేర్కొన్నారు.