ఏపీ సీఎం జగన్ రేపు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపుపై తెలంగాణ అభ్యంతరాలపై అధికారులతో చర్చించనున్నారు. దీంతోపాటు ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియపై కూడా చర్చలు జరపనున్నారు.ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు అంతకంతకూ వరద నీరు పెరుగుతోంది. కాసేపట్లో 5 గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది.
ఈరోజు జగన్ పర్యాటకశాఖపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అనుకూలంగా నూతన టూరిజం పాలసీ ఉండాలని ఆదేశించారు. పర్యాటకరంగంలో ఏపీకి తగిన స్థానం లభించేలా కృషి చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 వరకు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి: కేటీఆర్