telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక కొరత సృష్టించి పేదల పొట్టకొట్టారు: వైసీపీ పై చంద్రబాబు ఫైర్

chandrababu fire on AP CS again

వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడువిమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించి లక్షల మంది పేదల పొట్టకొట్టారని మండిపడ్డారు. ఇంకెన్నాళ్లీ ఇసుక కష్టాలు? అంటూ ట్విట్టర్ లో నిలదీశారు.

పండుగ వేళ పేద కుటుంబాలు పస్తులుండే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. సరైన ఇసుక విధానం లేకుండా చేసి నిర్మాణ కార్మికులను అప్పుల పాలయ్యేలా చేసి వారికి దసరా ఆనందం లేకుండా చేశారని ఆరోపించారు. ఇవన్నీ పేదల పొట్టకొట్టి వైసీపీ నేతల జేబులు నింపే అకృత్యాలు అంటూ ట్వీట్ చేశారు.

Related posts