telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కృష్ణా నది బోర్డు చైర్మన్ ను కలిసిన రేవంత్

Revanth-Reddy mp

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిశారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఆయనకు రేవంత్ వినతిపత్రం అందజేశారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని తెలిపారు. ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు.

l

Related posts